గండీడ్: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని సాలార్నగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకా రుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచితంగా మేలు రకమైన చేప పిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు. సాలార్ నగర్ ప్రాజెక్టు పరిసర గ్రామాల మత్య్సకారులు ప్రాజెక్టులోని మత్స్యసంపదతో ఆర్థికంగా వృద్ధి సాధించాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీనారా యణ, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, సర్పంచ్ బంటు సత్తె మ్మ, మహ్మదాబాద్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు రాంచంద్రారెడ్డి, ఉప్పరి గోపాల్, బంటు సాయిలు, నగేశ్, బంటు రాములు, భగవంతు గౌడ్, జోగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.