అలంపూర్,జనవరి 12 : తల్లిని మించిన దైవం లేదని సామా జికవేత్త, సంఘసేవకులు రమణగుప్త, మనోవికాస నిపుణులు మహేశ్ గుప్తా అన్నారు. గురువారం మండల పరిధి లోని లింగనవాయి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మాతృ పూజోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ముందుగా సరస్వతీదేవి చిత్ర పటానికి పూజ చేసి కార్య క్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జీహెచ్ఎం వెంకట రంగయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రమణగుప్తా మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సన్మార్గంలో నడిచేలా చూడాలన్నారు.
తల్లితండ్రులు, గురువులను పూజించుకోవడం భారతదేశ సంస్కృతి అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను మనం పాటిస్తే మన పిల్లలు మనని అనుసరిస్తారన్నారు. ఎంఈవో అశోక్కుమార్ మాట్లా డుతూ తల్లిదండ్రులు తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తునే కోరు కుంటారని పిల్లలు కూడా వారు చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు. వందేమాతరం ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు పోలీస్ చిన్నయ్య మాట్లాడుతూ తల్లి దండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించాలన్నారు. వినయం, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు పాఠశాలలో దాతలచే నిర్మించిన అదనపు తరగతి గదిని, సైడ్ వాల్ సేఫ్టీ గ్రిల్స్ ,తాగునీటి కులాయిని వారు ప్రారంభించారు.
గ్రామంలో మూడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు సామూహికంగా తల్లులకు పాదపూజ నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లులు భావోద్రేకంతో ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జ్యోతి,మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, గ్రామపెద్దలు వేమారెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం బాలాజీ, కృష్ణకు మార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఈదన్న, భూషణ్రెడ్డి, శ్రీరాం, మహేంద్ర, వెంకటేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.