నారాయణపేట టౌన్, జూలై 10 : పట్టణ మహిళా స మాఖ్యకు సంబంధించి 96 సంఘాలకు బ్యాంకు లింకేజీతో రూ.5 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలో శనివారం ని ర్వహించిన పట్టణ ప్రగతి సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైన మంత్రి కె.తారకరామారావు సంఘాల సభ్యులకు రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు. మంత్రు లు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ, మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభివాణి, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్టం నరేందర్రెడ్డి, మెప్మా పీడీ కృష్ణమాచారి, ఎల్డీఎం ప్రసన్నకుమార్, టీఎంసీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే చేతన స్వచ్ఛంద సంస్థ, కలెక్టర్ నిధులతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు గానూ 120 టీవీలను అం దజేయనున్నారు. అందులో భాగంగా మంత్రి కేటీఆర్ 3 టీవీలను పాఠశాలల నిర్వాహకులకు అందజేశారు. డీఈవో లియాఖత్అలీ, ఫౌండేషన్ సభ్యులు రంగారావు, వెంకటేశ్వర్లు, శాంత, ముత్తినేని, సురేశ్, నవీన్, షేక్ష్రీద్ పాల్గొన్నారు. పట్టణానికి చెందిన ఉత్తమ మున్సిపల్ వర్కర్ కిష్టమ్మను మంత్రి కేటీఆర్ సన్మానించి, అభినందించారు.