నారాయణపేట టౌన్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోషియేషన్ (టీటా) ద్వారా అందిస్తున్న కోడింగ్ సబ్జెక్టులో శిక్ష ణ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మంగళవారం పట్టణంలోని గు రుకుల పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ ముఖ్తలతో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసేందుకు, ఆధునాతన అంశాలలో పట్టు సాధించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.
ఈ శిక్షణతో జిల్లాలోని 2013 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నూతన నైపుణ్యాలు అందించనున్నట్లు పేర్కొన్నా రు. జిల్లాలోని 61 పాఠశాలలను ఎంచుకొని 183 భాగస్వాములను గుర్తించినట్లు తెలిపారు. వీరు నేరుగా శిక్షణ పొంది తదుపరి ఒక్కో పాఠశాలలో 30మందికి శిక్షణ ఇవ్వనున్నారని తెలియజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కోడింగ్ నై పుణ్యాలను నేర్చుకొని తదుపరి దశలో తమ తమ పాఠశాలల్లోని విద్యార్థులను సైతం అదే ఒరవడిలో తీర్చిదిద్దాలని చెప్పారు.
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ ముఖ్తల మాట్లాడుతూ ఈ కోడింగ్ శిక్షణలో స్క్రాచ్, ఫైథాన్ కోర్సులను నేర్పనున్నట్లు, టీఎ స్టీఎస్ ఈ కోర్సుకు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన జిల్లాకు చెందిన సర్కారీ బడుల విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో లియాఖత్ అలీ, విద్యాసాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.