మహబూబ్నగర్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డితో కలిసి బాలానగర్, కోయిలకొండలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించనున్నారు.
ఉదయం 11.45 గంటలకు బాలానగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కోయిలకొండ మండల కేంద్రం లో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభిస్తారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.