మక్తల్, జనవరి 25: మండల పరిధిలోని మహాద్వార్ గ్రామ శివారులో వెలిసిన గట్టు తిమ్మప్పస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వైష్ణవం సురేందర్ తెలిపారు. ఉదయం 8గంటలకు లక్ష్మీ, పద్మా వతీదేవి సమేతంగా వేంకటేశ్వరస్వామి ఉత్స వ విగ్రహాలను రాజేశ్వరరావు ఇంటి నుంచి గ్రామ పుర వీధుల గుండా మంగళ వాయి ద్యాలతో పల్లకీలో ఊరేగిస్తూ కొండపైకి తీసుకెళ్లి స్వామివారికి కృష్ణానది జలాలతో అభిషేకం చేశారు, శుక్రవారం సాయంత్రం ప్రభోత్సవం, 28న సాయంత్రం 5 గంటల కు రథోత్సవం, 29న పాల ఉట్లోత్సవం, 30న గరుడవాహన సేవ నిర్వహించనున్న ట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అభివృద్ధ్ది కమిటి సభ్యులు తెలిపారు.
మక్తల్ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాద్వార్ గ్రామ శివారు లోని కొండపై వేంకటేశ్వరస్వామి సంచరి స్తూ, ఆకులు, అలములు తింటూ కాలం గడి పేవారని ప్రతీతి. ఒక రోజు కొండ మీదకు వెళ్లిన పశువుల కాపరులు స్వామివారిని చూసి గ్రామస్తులకు వివరించారని. స్వామి వారి మహిమలను గ్రహించిన గ్రామస్తులు సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి యే ఇక్కడ తిరుగాడుతున్నాడని గుర్తించి కొండపై చిన్న గుడి నిర్మించి గట్టు తిమ్మప్ప స్వామిగా కొలుస్తున్నారని కథనం. ఆలయా న్ని నిర్మించి దాదాపు 300 సంవత్సరాలై ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. స్వామి వారి బ్రహోత్సవాలకు మహారాష్ట్రలోని ముం బాయి, షోలాపూర్, అమర్నాథ్ ,కర్ణాటక లోని గుల్బర్గా, యాద్గీర్, హైదరాబాద్ తది తర పట్టణాల నుంచి భక్తులు వేల సంఖ్య లో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటారు.