మహబూబ్నగర్: పేదలకు పూర్తిస్థాయిలో ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమవేశంలో నియోజకవర్గానికి చెందిన తిరుప తయ్యకు రూ. 3లక్షలు, నర్సింహులుకు రూ.1.50, ఆసిఫ్కు రూ.1 లక్ష చొప్పున సీఎం సహయ నిధి నుంచి మంజూ రైన మొత్తం రూ.5.5 లక్షలను మంత్రి శ్రీనివాస్గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు దవాఖానలకు ధీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందిం చడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిల ర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.