మహబూబ్నగర్: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారానా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్కాలనీలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని, కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావుతో కలిసి పరిశీలించారు.
అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోఅధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు స్నానపు గదులు, తలుపు లు, కిటికీలు, దోమలు కుట్టకుండా ఏర్పాటు చేసిన జాలీలు, హాస్టల్స్లో పరిసరాలు , మురుగునీటి పారుదల తదితర సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల వసతి గృహం నందు తనిఖీ చేశామని ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు 12 టాయిలెట్స్ ఉండగా మరిన్ని నిర్మాణం చేపట్టాలన్నారు. అవసరమైతే అదనపు నిధులు ఇస్తామని తెలిపారు. వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.