మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 22 : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచడం అందరి బాధ్యత అని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో మంత్రులతో కలసి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్య త కూడా తీసుకోవాలన్నారు. దేశంలోనే అతిపెద్ద అర్బ న్ ఎకో టూరిజం పార్కు, కేసీఆర్ పార్కు చాలా అద్భుతంగా ఉండాలన్నారు. అనంతరం బైపాస్ రోడ్డులో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు.
తాగునీటికి ఇబ్బందులు రానివ్వం
మహబూబ్నగర్, జూన్ 22 : తాగునీటికి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలోని దివిటిపల్లి గ్రామంలోని డబుల్బెడ్రూం ఇండ్లను, మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. రూ.3.60 కోట్ల ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకుగానూ అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేశారు.
నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ప్రతిక్షణం ప్రజలకు మంచి చేయాలనే తపనతో ప్రభుత్వం శ్రమిస్తుందని తెలియజేశారు. కార్య క్రమాల్లో జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్, డీఎఫ్వో గంగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, దివిటిపల్లి సర్పంచ్ జరీనాబేగం, ఎంపీపీ సుహాసిని, ఆర్డీవో పద్మశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.