మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ను గురువారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు డాక్టర్ వి.యం.అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు గుండెకాయ లాంటి తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలోని మల్లమ్మ కుంట రిజర్వాయర్, ఇటీవల మంత్రి కేటీఆర్ అలంపూర్ చౌరస్తాలో భూమి పూజ చేసిన 100 పడకల ప్రభుత్వ దవాఖానను, గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎంను కోరారు.
సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. వారి వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉత్తనూరు తిరుమల్ రెడ్డి తదితరులు ఉన్నారు.