మక్తల్ రూరల్, జూలై 5 : విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో 10వ తరగతిలో మంచి ఫలితాలతో నిలిచిన విద్యార్థులను మంగళవారం ఎమ్మెల్యే శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. పేదలు ఉన్నత చదువులు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి అధి క ప్రాధాన్యత కల్పించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ని యోజకవర్గ కేంద్రంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చే యడం జరిగిందన్నారు.
గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు 2021-22 10వ తరగతి పరీక్షలో ఉత్త మ ఫలితాలు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశా రు. ఈఏడాది కూడా గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అక్షయ్కుమార్, శివకుమార్, వెంకటేశ్ 10వ తరగతి ఫలితాలలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. వందశాతం ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ప్రిన్సిపాల్ రాములు, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.