‘పది’ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎగ్జామ్స్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కొవిడ్ కారణంగా రెండేండ్ల తర్వాత జరగనుండగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు కొనసాగనుండగా.. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 235 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 47,754 మంది విద్యార్థులు (బాలికలు 24,083, బాలురు 23,671) హాజరు కానున్నారు. తాగునీరు, బెంచీలతోపాటు సీసీ కెమెరాలు అమర్చారు. చీఫ్ సూపరింటెండెంట్లు 235 మంది, డిపార్ట్మెంటల్ అధికారులు 235, ఇన్విజిలేటర్లు 2,533 మంది పర్యవేక్షించనున్నారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. శనివారం సెంటర్లను విద్యాశాఖాధికారులు పరిశీలించారు. అపోహలు, అనుమానాలకు తావులేకుండా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
మహబూబ్నగర్టౌన్, మే 21 : కొవిడ్ కారణంగా రెండేండ్ల తరువాత నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏ ర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి టెన్త్ పరీక్ష లు ప్రారంభం కానుండగా.. మహబూబ్నగర్ జి ల్లాలోని 13,243 మంది విద్యార్థులకు 59 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 88 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని 274 పాఠశాలల నుంచి 6,642 మంది బాలికలు, 6601 మంది బాలురు పరీక్షకు హాజరుకానున్నారు. 59 కేంద్రాల్లో నలుగురు ఫ్లెయింగ్స్యాడ్లు (విద్యాశా ఖ, రెవెన్యూ, పోలీస్శాఖ అధికారులు), 11 మంది కస్టోడియన్లు (ఎంఈవోలు, జీహెచ్లు), 666 మంది ఇన్విజిలెటర్లు, 59 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 59 డిపార్డ్మెంటల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించనున్నారు. కేంద్రాల్లో తాగునీరు, బెంచీ లు, షామియానాలతోపాటు పారదర్శకత కోసం సీసీ కెమెరాలను బిగించారు. పరీక్ష పత్రాలు ఇప్పటికే పోలీస్స్టేషన్కు చేరుకోగా..లాకర్లో భద్రపరిచారు.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహస్తుండగా.. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. పరీక్ష సమయానికి గంట ముందు పో లీసు బందోబస్తు నడుమ ప్రశ్నాపత్రాలను కేంద్రానికి తరలించి పరీక్ష ప్రారంభానికి 15 నిమిషా ల ముందు సీసీ కెమెరాల నిఘా లో సీల్ తీయనున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే విద్యార్థులను హాల్లోకి అనుమతించనున్నారు. సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పోలీసులకు సైతం అనుమతించరు. సీఎస్, డీవోలు కూడా సెల్ఫోన్లు తీసుకెళ్లకూడదు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సమస్య ఉంటే 08542-241165, 252 203 నంబర్లను సంప్రదించొచ్చు.
జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు 59 కేంద్రాల్లో తాగునీటి వసతి, బెంచీలు, షామియానాలు వేయిస్తు న్నాం. పారదర్శకంగా ఉండేలా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు అమర్చాం. ఇప్పటికే వి ద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు వెనుకబడిన వారిని గుర్తించి సబెక్టులపై మరింత పట్టువచ్చేలా ప్రయత్నించాం. పరీక్ష సమయానికంటే ఐదు నిమిషాలు ఆలస్యమైతే అనుమతించరు. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకుంటే మంచిది.
– ఉషారాణి, డీఈవో, మహబూబ్నగర్