మహబూబ్నగర్, ఏప్రిల్ 10 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : రక్తదా నం మహాదానం అని ఊరికే అనలేదు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానకు వస్తే సకాలంలో రక్తం అందించి శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలు కాపాడే అవకా శం ఉంటుంది. కాన్పు సమయాల్లో అనేక మంది గర్భిణులు సకాలంలో ర క్తం అందక ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంటుంది. అయితే, ప్రస్తుతం కొవిడ్ కారణంగా చాలా మంది రక్తదానం చేసేందుకు ముందు కు రావడం లేదు. బ్లడ్ బ్యాం కుల్లో రక్తనిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం రోగుల పై పడుతున్నది. చాలా మంది రక్తం దొరకక అవస్థలు పడుతున్నారు. రక్తదానం చేసేందు కు దాతలు ముందుకు రాకపోతే పరిస్థితి ఇబ్బందిరకంగా మారుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
తగ్గుతున్న రక్తనిల్వలు..
మహబూబ్నగర్ జనరల్ దవాఖానలోని బ్లడ్ బ్యాంకులో ప్రతి నెలా కనీసం 300 యూనిట్ల రక్తం సేకరించేవారు. పలువురి పుట్టిన రోజులు, ఆయా సందర్భాల్లో వివిధ సంస్థలు స్వచ్ఛందంగా సేకరించే రక్తదానంతో ఈ రక్తం సమకూరేది. అయితే ఏడాది కాలంగా కరోనా నేపథ్యంలో ఎక్కడి వాళ్లు అక్కడే అన్న తీరుగా పరిస్థితి మారిపోయింది. రక్తదానం కో సం ఎప్పుడైనా సిద్ధంగా ఉండే పలు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు కరోనా నేపథ్యంలో మూతపడడంతో విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రక్తదానం చేసే వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ప్రభావం వల్లే రక్తనిల్వలు లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లే దు. ప్రస్తుతం మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో 200 యూనిట్ల రక్తం మాత్రమే నిల్వ ఉన్నది. ఒక్క మహబూబ్నగర్లో మాత్రమే కా దు. దాదాపుగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. గ ద్వాల బ్లడ్ బ్యాంకులో 2019లో 1,780 యూనిట్ల రక్తం అందుబాటులోకి రాగా.. 2020లో ఆ సంఖ్య 1409కి పడిపోయింది. ఈ ఏడాది పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వనపర్తిలో 2019లో 1995 యూ నిట్లు, 2020లో 1790 యూనిట్ల రక్తం సేకరించగా.. 2021లో ఇప్పటివరకు కేవలం 540 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నది.
రక్తం లేకుంటే ప్రాణాలకే ప్రమాదం..
రెడ్క్రాస్తోపాటు జనరల్ దవాఖాన ఆధ్వర్యంలో గతంలో రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. కొవి డ్ నేపథ్యంలో ప్రస్తుతం రక్తదాన శిబిరాల ఏ ర్పాటు గగనమైపోయింది. ఎండాకాలం కావడంతో చాలా మం ది ముందుకు రావడం లేదు. గతేడాది సైతం ఇ బ్బంది ఉన్నా.. ఈ స్థా యిలో లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ తరుణంలో రక్తం అవసరం భారీగా పెరిగిపోయింది. చాలా మంది రోగులు వారికి అవసరమైనప్పు డు రక్తం అడుగుతున్నారు.. కానీ వారి బంధువులు రక్తం రీప్లేస్మెంట్కు ముందుకు రావడం లేదని వైద్యులు వాపోతున్నారు. ఆర్థికంగా స్థోమత ఉన్న వారు మాత్రం ప్రైవేట్ బ్లడ్ బ్యాం కుల్లో డబ్బులు చెల్లించి రక్తం కొనుగోలు చేస్తున్నారు. పేద రోగులకు ఇబ్బంది తప్పడం లేదు. రక్తహీనత ఉన్న గర్భిణులకు, డయాలసిస్ కేంద్రానికి క్రమం తప్పకుండా రక్తం అవసరం. ఒక్కో డయాలసిస్ రోగికి రెండు యూనిట్ల రక్తం ఎక్కిస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో 546 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. వీరిలో నిత్యం సుమారు 100 మందికి తక్కువ కాకుండా సేవలు పొందుతున్నారు. అలాగే ఉ మ్మడి జిల్లాలోని 172 మంది తలసేమియా రో గులకు సైతం 20 రోజులకోసారి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే తలసేమియా రోగుల ప్రాణాలకే ప్రమాదం. రక్తం విలువ ఎంతో ఇలాంటి రోగులను చూస్తే అర్థమవుతుంది.
ఉమ్మడి జిల్లాలోని బ్లడ్ బ్యాంకులు..
మహబూబ్నగర్లో జనరల్ దవాఖాన, రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులతోపాటు నాలుగు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులున్నాయి. వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రాల్లోని జిల్లా దవాఖానల్లో బ్లడ్ బ్యాంకులున్నాయి.
రక్తదాతలు స్పందించాలి..
రక్తం అందుబాటులో ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని తెలిసినా చాలా మంది ముందుకు రావడం లేదు. ఆ పరిస్థితి వీడి రక్తదానం చేసేందుకు ఆరోగ్యవంతులైన వారు ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు మూడు నెలలకోసారి రక్తదానం చేసినా.. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాల్సి ఉన్నది. సాధారణంగా వేసవిలో రక్తనిల్వల కొరత ఉంటుంది. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు పెరగాలంటే స్వచ్ఛంద సంస్థలు రక్తదానంపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. గ్రామాల్లోని ప్రజలకు సైతం వివరించాలి. గ్రామ పంచాయతీలు బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే మార్పు వస్తుంది.
రక్తదానం చేయండి..
వేసవికాలంలో రక్తదానం చేసేందుకు చాలా మందికి ముందుకు రావడం లేదు. మ రోవైపు కరోనా వల్ల దవాఖానకు వచ్చి రక్తం ఇచ్చేందుకు భయపడుతున్నారు. గర్భిణులు, శస్త్రచికిత్సలు, అత్యవసర కేసుల్లో రక్తం అవసరం అవుతున్నది. రక్తనిల్వలు పెంచేందుకు ప్రజలు సహకరించాలి. రక్తదానం చేసేందుకు 10, 15 మంది సిద్ధంగా ఉన్నా.. వారు కోరుకున్న చోట మేము క్యాంపులు నిర్వహిస్తాం. దవాఖానకు వచ్చి రక్తదానం చేస్తామంటే కూడా ఏర్పాట్లు చేస్తాం.
తలసేమియా చిన్నారుల పరిస్థితి దయనీయం..
సకాలంలో రక్తం లేకుంటే అనేక మంది రోగుల ప్రా ణాలు కోల్పోతున్నారు. ఉమ్మ డి జిల్లాలో 172 మంది చి న్నారులు తలసేమియా వ్యా ధితో బాధపడుతున్నారు. వీరి కి ప్రతి 20 రోజులకోసారి ర క్తం ఎక్కించాల్సి ఉంటుంది. ప్రతి రోగికి ఏడాదికి 20 సా ర్లు రక్తం అవసరమవుతుంది. వీరికే కాకుండా గర్భిణు లు, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు, డయాలసిస్ రోగులు ఇలా అనేకమందికి రక్తం అవసరం. ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి.