మక్తల్ టౌన్, మే 30 : మక్తల్ పెద్దచెరువు తూము నిర్మాణం చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరారు. ఆదివారం పట్టణంలోని పెద్దచెరువు తూము నిర్మించాలని ఆయకట్టు రైతులు కోరు తూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మక్తల్ పెద్దచెరువును రూ. ఆరుకోట్లతో మినీ వాటర్ ట్యాంక్బండ్గా రూ పొందించాలని ప్రభుత్వం పనులు చేపట్టి దాదా పు పనులు పూర్తి చేసిందని, అందులో భాగంగా పెద్ద చెరువు తూము నిర్మాణం చేపట్టిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్మించిన నాలుగు నెలులకే తూము కూలిపోయిందని తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం యాసంగిలో పెద్ద చెరువు నింపడంతో పంటలు బాగా పండాయని సంవత్సరానికి రెండు పంటలు వేసుకుంటున్నామని పేర్కొన్నారు. వర్షకాలం మొదలయిందని ఇంకా అధికారులు తూము నిర్మాణ పనులు చేపట్టకపో వడంతో చెరువులో నీరు నిలువదని, వర్షాకాలం పంటలకు ఉపయోగపడేవిధంగా అధికారులు వెంటనే తూము నిర్మాణ పనులు చేపట్టే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో మధుసూదన్రె డ్డి, సుదర్శన్రెడ్డి, సంజీవ్రెడ్డి, కృష్ణయ్య, బాల ప్ప, కుర్మయ్య పాల్గొన్నారు.