కొవిడ్పై నిర్లక్ష్యం వద్దు
మరికల్ పీహెచ్సీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి
మరికల్, మే 30: ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని, కొవిడ్ వైరస్పై నిర్లక్ష్యం తగదని నారాయణ పేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చే శారు. ఈ సందర్భంగా పీహెచ్సీ పరిధిలో ఇంతవరకు ఎం తమందికి వ్యాక్సిన్ వేశారో డాక్టర్ రహమత్ ఖాన్ను అడిగి తెలుసుకున్నారు. మరికల్లో ఇంతవరకు సుమారు మూ డు వేలమందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపా రు. జిల్లాలో మరికల్ ఆరోగ్య కేంద్రంలోనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేశారని ఎమ్మెల్యే అన్నారు.
కొవిషీల్డ్.. కొవాగ్జిన్ వేరు కాదు…
చాలా మంది కొవిషీల్డ్, కొవాగ్జిన్లో ఏది వేసుకోవాలని సందిగ్ధంలో ఉన్నారని, రెండూ కొవిడ్ వై రస్ను తట్టుకోవాడానికే వే స్తారని, రెండు వ్యాక్సిన్లు వేర్వేరు కాదని ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి ఆన్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావని, కరోనా వై రస్ నివారణకు వ్యాక్సినే మార్గమని ఎమ్మె ల్యే సూచించారు. మరికల్ ఆరోగ్య కేంద్రం పనితీరు భేష్గా ఉందని కితాబునిచ్చారు. ఆరోగ్య కేంద్రంలో మాస్కులు, శానిటైజ ర్లు, గ్లౌజ్ల కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి సిబ్బంది తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే 24 గంటల్లో వాటిని దవాఖానకు చేరుస్తానని హామీ ఇచ్చారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జె డ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, సీనియర్ నాయకులు రాజవర్ధన్రెడ్డి, సర్పంచ్ గోవర్ధన్, వైస్ ఎంపీపీ రవికుమార్, కోయిల్కొండ పీఎసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పేట ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, దవాఖాన సిబ్బంది డాక్టర్ రహమత్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.