లాక్డౌన్ పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం
మహబూబ్నగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మరో 10 రోజులు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉరుకులు పరుగులకు ఫుల్స్టాప్ పడనున్నది. ఆదివారం వరకు కొనసాగిన లాక్డౌన్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉండడంతో జనం రద్దీ వి పరీతంగా ఉండేది. ఇప్పుడు మినహాయింపులను పెంచడంతో గుమిగూడే పరిస్థితి తగ్గిపోనున్నది. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నా.. వెసులుబాటు సమయాన్ని పెంచింది. ఆదివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన క్యాబినె ట్.. నేటి నుంచి మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
క్రమం గా కరోనా కేసుల సంఖ్య తక్కువ అవుతుండటంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా వెసులుబాటు సౌకర్యం పెంచినట్లుగా భావిస్తున్నారు. సడలింపు సమయాన్ని ప్ర భుత్వం మూడు గంటలు పెంచడాన్ని పాలమూరు వాసులు స్వాగతిస్తున్నారు. ఇ ప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. దాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. సడలింపు సమయం తర్వాత బయట కు వెళ్లిన ప్రజలు ఇండ్లకు చేరుకోవడానికి మరో గంట పాటు అదనపు సమయం ఇచ్చారు. ఫలితంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్డౌన్ అమల్లో ఉండనున్నది. ఎప్పటిలాగే అత్యవసర సే వలు సహా గతంలో అనుమతించిన కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి మినహా యింపు కొనసాగనున్నది. లాక్డౌన్ సమయంలో వివిధ అవసరాలతో బయటకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ఈ-పాస్ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారు లు తెలిపారు. అయితే ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని అవసరం ఉన్నా లేకపోయినా రోడ్లపైకి రాకూడదంటున్నారు.