జడ్చర్ల, ఏప్రిల్ 27: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఆయన మున్సిపాలిటీలోని 3,4,7,11,18వ వార్డుల్లో ప్రచారం చేశారు. ముందుగా 7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఉమాదేవి తరఫున బూరెడ్డిపల్లిలో, 11వ వార్డు సరస్వతీనగర్లో జ్యోతి తరఫున, 3వ వార్డు సరస్వతీనగర్, సాయినగర్, రాజీవ్నగర్, గౌరీశంకర్కాలనీలో సతీష్ తరఫున, 4వ వార్డు గౌరీశంకర్కాలనీ, మాధవరావు కంపౌండ్, వీరశివాజీనగర్ దేవా తరఫున, 18వ వార్డు ఫజల్బండ, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంతాల్లో ముఖీద్ తరఫున ప్రచారం నిర్వహించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. జడ్చర్లలో 70ఏండ్లలో లేని అభివృద్ధి ఏడేండ్లలో చేశామన్నారు. రోడ్ల విస్తరణ, సెంట్రల్లైటింగ్ సిస్టం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాకనెక్షన్లు ఇచ్చామని, త్వరలోనే నల్లాల ద్వారా శుద్ధ జలాలు సరఫరా కానున్నాయన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని తెలిపారు. రైతులకోసం రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. జడ్చర్ల పట్టణంలో రెండు మినీ ట్యాంకుబండ్లు ఏర్పాటు చేశామన్నారు. జడ్చర్ల మరింత అభివృద్ధి చెందాలంటే కారుగుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మున్సిపాలిటీలోని 27 వార్డుల్లో 27మందిని గెలిపించి గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రఘుపతిరెడ్డి, బాద్మి రవిశంకర్, అశోక్రెడ్డి, పర్వత్రెడ్డి, పాలాది రమేశ్, నాగిరెడ్డి, సర్పంచులు ఈర్లపల్లి ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్, సత్యయ్య, మొగులయ్య, ఇఫ్తేకారొద్ద్దీన్, శ్రీనివాస్యాదవ్, ఇమ్మూ, శంకరనాయక్, నర్సింహులు, మల్లేశ్, దానిష్, మసియొద్దీన్, శివదర్శన్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.