కోయిలకొండ ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోయిలకొండలోని వివేకానంద చౌరస్తాలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళాభీంరెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, మండల ప్రధానకార్యదర్శి రాజవర్ధన్రెడ్డి, కుమ్మరి ఆంజనేయులు, నాయకులు నారాయణగౌడ్ పాల్గొన్నారు.
హన్వాడలో
హన్వాడ, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్వాడలో పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, నాయకులు లక్ష్మయ్య, శ్రీనివాసులు, జంబులయ్య, మోహన్, డబ్బరాములు, సత్యం, నరేందర్, యాదయ్య పాల్గొన్నారు.
దేవరకద్ర, చిన్న చింతకుంటలో..
దేవరకద్ర రూరల్, ఏప్రిల్27: టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను దేవరకద్ర, చిన్న చింతకుంట మండలాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేవరకద్రలో పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, పెద్దగోప్లాపూర్లో ఎంపీపీ రమాదేవి, చిన్నచింతకుంట మండలంలోని ఫర్దీపూర్లో పార్టీ మండల అధ్యక్షుడు కోటరాము పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం స్వీట్ల పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పురస్కరించుకొని అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపు మేరకు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో జెండాను పార్టీ అధ్యక్షులు ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, గూపని కళావతికొండయ్య, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు టీ శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనర్సింహా యాదవ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ మద్దూరి జితేందర్రెడ్డి, బండా వెంకటేశ్వర్రెడ్డిలతో పాటు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్లో..
రాజాపూర్, ఏప్రిల్ 27: రాజాపూర్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్ కొవిడ్ నిబంధనలతో పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, మండ ల కోఆప్షన్ సభ్యుడు అల్తాఫ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నరహరి, నాయకులు ఆనంద్గౌడ్, యాదగిరి, రమేశ్నాయక్, శంకర్నాయక్, నర్సింహులు, భాస్కర్ పాల్గొన్నారు.
మిడ్జిల్లో..
మిడ్జిల్, ఏప్రిల్ 27: మిడ్జిల్లో టీఆర్ఎస్ మిడ్జిల్ మండలాధ్యక్షుడు పాండు పార్టీ జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు బాలయ్య, వెంకట్రెడ్డి, డానియల్, కరుణాకర్రెడ్డి, బాలస్వామి, బంగారు, మల్లేశ్, చంద్రయ్యగౌడ్, వెంకటయ్య, నరేశ్, బుచ్చయ్య, జగన్గౌడ్ పాల్గొన్నారు.
బాలానగర్లో..
బాలానగర్, ఏప్రిల్ 27 : బాలానగర్ మండల కేంద్రంతో పాటు గౌతాపూర్, ఎక్వాయపల్లి, ఉడిత్యాల తదితర గ్రామాల్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు వస్పుల సాయిలు, కృష్ణ, సుధాకర్, కల్లెం శ్రీనివాసులు, శ్రీనివాస్రెడ్డి, యాదయ్య, భాస్కర్, తదితరులున్నారు.
నవాబ్పేటలో..
నవాబ్పేట, ఏప్రిల్ 27: మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. జయశంకర్ సార్కు నివాళులర్పించి..పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోశ్రెడ్డి, సర్పంచ్ గోపాల్గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, మండల కోఆప్షన్ సభ్యులు తాహెర్, నాయకులు శ్రీరాములు, గిరియాదవ్, రవిశంకర్, మ్యాదరి రవి, రాజు, నర్సింహులు పాల్గొన్నారు.
గండీడ్లో..
గండీడ్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని గండీడ్, మహమ్మదాబాద్లో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గిరిధర్రెడ్డి, నాయకులు పాల్గన్నారు.