మహబూబ్నగర్, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేశామని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తు చేశా రు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ వేడుకలకు మంత్రి హాజరై పార్టీ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు. రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా నిర్ధేశించుకుని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసింది టీఆర్ఎస్సే అన్నారు. సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా రూపొందించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ వనరులను పూర్తిస్థాయిలో దెబ్బతీసి ఆంధ్రా ప్రాంతానికి మేలు జరిగేలా చేసిన ఉమ్మడి పాలకులను నాడు కేసీఆర్ నిలదీశారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం రాత్రి, పగలు నిరంతరం శ్రమిస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా సస్యశామలం అవుతుందన్నారు. ప్రతి చెరువునూ కృష్ణానీటితో నింపుతామని చెప్పారు. రాబోయే ఐదేండ్లలో మహబూబ్నగర్ మహానగరంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ అద్భుతంగా.. అందరికీ ఆదర్శంగా ఉండేలా జిల్లాను తీర్చిదిద్దుకుందామని పేర్కొన్నారు.
బాధ్యతగా పనిచేయండి
ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని స ద్వినియోగం చేసుకుంటూ పేరుప్రతిష్టలు తమ సొంతం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూ చించారు. టీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా జనరల్ దవాఖానలో విధులు నిర్వహించనున్న 14 మంది స్టాఫ్నర్సులకు నియామక పత్రాలను మం త్రి పంపిణీ చేశారు. పేదలకు మరింత చేరువగా ఉంటూ వైద్యసేవలు అందించాలన్నారు. మంచి పనులతోనే గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
రైతులకు అండగా ప్రభుత్వం
రైతులకు ఎల్లప్పుడూ అండగా టీఆర్ఎస్ ప్రభు త్వం ఉంటుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బోయపల్లికి చెందిన రైతు చిట్టెమ్మ మృతి చెందగా.. రైతుబీమా ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును ఆమె భర్త మన్యంకు మంత్రి అందజేశారు. రైతు సంక్షేమానికి కనీవిని ఎరుగని రీతి లో ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. గత ప్ర భుత్వాల హయాంలో రైతులు మృతి చెందితే ప ట్టించుకోలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభు త్వం ప్రతిక్షణం అండగా నిలుస్తున్నామన్నారు. కా ర్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజేశ్వర్, కాడం ఆంజనేయులు, వైద్యాధికారులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్యాదవ్, కరుణాకర్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.