ఐదు చెక్పోస్టులు ఏర్పాటు
తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో నిరంతరం పహారా
అత్యవసర వాహనాలు మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదు
నారాయణపేట, మే 27 : మొదటి విడుత లాక్డౌన్ మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. తెలంగాణ – కర్ణాటక రా ష్ర్టాల సరిహద్దుకు ఆనుకొని ఉన్న నారాయణపేట జిల్లా పరిధిలో ఐదు ప్రాంతాల్లో సరిహద్దు చెక్పోస్టులను ఏర్పా టు చేశారు. ఆయా చెక్పోస్టుల వద్ద పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. కేవలం అత్యవసర వాహనాలు, అనుమతి ఉన్న వాహనాలు, నిత్యావసర వస్తువులకు సంబంధించిన వాహనాలకు అనుమతినిస్తున్నారు. కర్ణాటక సరిహద్దు పరిధిలోని పలు గ్రామాలకు తెలంగాణ పరిధిలోని మక్తల్, నారాయణపేట పట్టణాలు ప్రధాన వ్యాపా ర కేంద్రాలుగా ఉన్నాయి. కర్ణాటక పరిధిలోని గ్రామాల ప్రజలు కూరగాయల నుంచి ప్రతి వస్తువు కొనుగోలుకు, వైద్య చికిత్సలకు మక్తల్, నారాయణపేట ప్రాంతాలకు వస్తుంటారు. ఈ రెండు పట్టణాలకు వెళ్లే సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు వివిధ వస్తువుల కొనుగోలు కో సం కొంతమేరకు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా సరిహద్దులను కట్టడి చేయడం వల్ల ఇరు రాష్ర్టాలకు ఎంతో మేలు జరుగుతున్నదని భావించిన అధికారులు ఆ మేరకు చర్య లు తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రజలు సైతం అర్థం చేసుకొని మసలుకొంటున్నారు.
జిల్లాలో ఐదు చెక్పోస్టులు
నారాయణపేట జిల్లా పరిధిలో కర్ణాటక రాష్ర్టానికి ఆనుకొని ఉన్న నారాయణపేట మండలంలో జలాల్పూర్,.ఎక్లాస్పూర్ దామరగిద్ద మండలంలో కాన్కూర్తి కృష్ట మండలంలో చేగుంట, వాసవీనగర్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
ఎస్పీ పర్యవేక్షణ…
జిల్లా పరిధిలోని రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలిస్తున్నారు. ఆమెతోపాటు జిల్లాస్థాయి అధికారులు సైతం ప్రతిరోజు ఏదో ఒక చెక్పోస్టును సందర్శించి, విధులు నిర్వర్తించే పోలీసులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. కొవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్కులు ధరించి విధులు చేపట్టాలని సూచిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు వ్యాక్సినేషన్ చేయించారు.