డీఎస్పీ మధుసూదన్రావు
నారాయణపేట, మే 26 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మధుసూదన్రావు అన్నారు. బుధవారం డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 28 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రాకూడదని, అత్యవసరం, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలోనే రావాలన్నారు. అవసరమున్న వారు ఈ పాస్ తీసుకోవాలని, లేదంటే తగిన మెడికల్ ఆధారాలు చూయించాలన్నారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తమ కార్యకలాపాలు చేసుకోవాలన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు తమ సహకారం అందించాలన్నారు. పరిశుభ్రతను పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్సై సైదయ్య, ఏఎస్సై బాలయ్య, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
పకడ్బందీగా లాక్డౌన్
ఊట్కూర్, మే 26 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు మరింత పఠిష్టంగా అమలు చేస్తున్నారు. బుధవారం మండలంలో సంతకు వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ పోలీసుల సూచనల మేరకు ఉదయం 10 గంటలకే సంత బజార్ను ముగించారు. లాక్డౌన్ నిబంధనల మేరకు హోటళ్లు, దుకాణాలను సైతం మూసివేయగా ప్రజలు ఇండ్లకే పరిమితయ్యారు. దీంతో ప్రజల సందడి లేక ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. లాక్డౌన్ నిబంధనలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవి హెచ్చరించారు.
అనవసరంగా తిరిగితే జరిమానా
నారాయణపేట రూరల్, మే 26 : జిల్లా కేంద్రంలో లాన్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నదని, అనవసరంగా బయట తిరిగితే జరిమానా విధించడంతోపాటు నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలను సీజ్ చేస్తామని ఎస్సై సైదయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాలను తనిఖీ చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సై-2 అఫ్జల్, సత్యనారాయణ చౌరస్తా వద్ద ఏఎస్సై బాలయ్యతోపాటు తిమ్మారెడ్డి, రమేశ్రావు, మొయినుద్దీన్, మున్సిపల్ అధికారులు శ్రీధర్, సిబ్బంది వాహనాల తనిఖీలు చేశారు. సీఐ శ్రీకాంత్రెడ్డి లాక్డౌన్ లో పోలీసు సిబ్బంది విధులను పర్యవేక్షించారు.