మహబూబ్నగర్, మే 25 : జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీసీలో వైద్య అధికారులతోపాటు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచాలని ఆదేశించిందని, ప్రతిరోజూ 3600 టెస్టులు చేయాలని పేర్కొన్నారు. రెండో డోస్ వ్యాక్సిన్ను ప్రారంభించాలని, మొదటి డోస్ వేసిన వారికి మాత్రమే రెండో డోస్ వేస్తామని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 130 నుంచి 140 వరకు కరోనా టెస్టులు నిర్వహించాలని తెలియజేశారు. బస్తీ దవాఖానల్లో కూడా కనీసం 25 టెస్టులు నిర్వహించే లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా నివారణే ప్రథమ లక్ష్యంగా అధికారులు తమవంతు పూర్తిస్థాయిలో కృషి చే యాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీసీలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా క్టర్ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శశికాంత్, పీహెచ్సీల వైద్యాధికారులు, పీవో లు, సూపర్వైజర్లు ఉన్నారు.
భూసేకరణను పూర్తి చేయాలి
ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టర్ క్యాం పు కార్యాలయం నుంచి భూసేకరణతోపాటు వివిధ అంశాలతో తాసిల్దార్లు, ప్రాజెక్టుల ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో వీసీ నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ప్యాకేజీల వారీగా కలెక్టర్ సమీక్షించారు. భూముల విషయంలో నిర్వహించిన ప్రత్యేక ట్రిబ్యూనల్లో హియరింగ్కు వచ్చిన కేసులను తక్షణమే క్లియర్ చేయాలని, ఆర్డర్ పాస్ చేయాల్సిన వాటిని జాప్యం లేకుండా ఆర్డర్ పాస్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడవకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూన్ 2నాటికి పూర్తిస్థాయిలో ధాన్యం సురక్షిత ప్రదేశంలో నిల్వ ఉంచాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని సూచించారు. మిల్ల ర్ల సామర్థ్యం పెంచుతూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాకు మరో 10లక్షల గన్నీ బ్యాగులను కేటాయించడం జరిగిందని, ధాన్యం సేకరణ మరింత వేగంగా చేపట్టి రైతులు ఇబ్బందులు పడకుండా చూ డాలని కలెక్టర్ సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో కె. స్వర్ణలత, అధికారులు పాల్గొన్నారు.