మూసాపేట, మే 24 : మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామశివారులో ఉన్న పాలమూరు డెయిరీ నిర్వాహకులు సేవాభావంతో 250మంది కరోనా బాధితులకు నిత్య భోజనం అందిస్తున్నారు. పాలమూరు డెయిరీ నిర్వాహకుడు ఏవీ రామకృష్ణ మూసాపేట మండలంలోని ఆయా గ్రామా ల్లో కరోనా బారిన పడిన వారికి మధ్యాహ్న భోజనం అందించి ఆకలి తీరుస్తున్నారు. కోడిగుడ్డు, రెండు రకా ల కూరగాయలతోపాటు, చికెన్తో కూడిన భోజనం సరఫరా చేస్తున్నా రు. ప్యాకెట్లుగా తయారు చేయడానికి మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య ప్రతిరోజూ ఆయన అనుచరులతో కలిసి తయారు చేయడంతోపాటు, కారులో ఆయా గ్రామాలకు తీసుకెళ్లి గ్రామ పంచాయతీల వద్ద అందజేస్తున్నారు. కష్టకాలంలో కూడా ప్రతిరోజూ మంచి భోజనం అందించడంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.