పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం : ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్టౌన్, జూన్ 20: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 16వ వార్డు బోయపల్లిలో రూ.10లక్షలతో ముదిరాజ్భవన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని, ఇప్పటికే రోడ్డు విస్తరణ వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లు అభివృద్ధి చేశామని, తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు మోతీలాల్, నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరక్టర్ పత్తి వెంకట్రాములు, ముదిరాజ్ సంఘం వార్డు అధ్యక్షుడు పి.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కోట్ల నర్సింహులు, ఉపాధ్యక్షుడు రాంచంద్రయ్య, నాయకులు బుచ్చారెడ్డి, వినోద్గౌడ్, లక్ష్మీనారాయణ, యాదయ్యగౌడ్ పాల్గొన్నారు.
ఎవరూ అధైర్యపడొద్దు..
హన్వాడ, జూన్ 20 : ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం అం డగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం హన్వాడలో రూ.5లక్షలతో నూతనంగా నిర్మించిన గౌడ సంఘం భవనాన్ని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు. మండల కార్యాలయంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులను మంత్రి, ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీచర్లకు సరుకులు అందజేయడంపై పీఆర్టీయూ సంఘం సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 65మంది టీచర్లకు సరుకులు అందజేశారు. ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి చెందిన నారాయణ రూపొందించిన వీడియోసాంగ్స్ను విడుదల చేశారు. ఎంపీపీ బాల్రాజ్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఎంఈవో రాజునాయక్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు మదన్మోహన్, ప్రధాన కార్యదర్శులు స్వామి, ప్రైవేట్ టీచర్ల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రాములు, నర్సింహులు, రాజు, కరుణాకర్గౌడ్, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, సుదీప్, లక్ష్మయ్య, నాగేశ్, వెంకటయ్య పాల్గొన్నారు.
సర్పంచుల ‘గౌరవం’ పెరిగింది..
ప్రభుత్వం ప్రజాప్రతినిధుల జీతాలను పెంచడంతో గ్రామాల్లో గౌరవం పెరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల జీతాలు పెంచడంతో ఆదివారం జిల్లా సర్పంచుల సంఘంతో పాటు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డిని పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీతాలు పెరగడంతో బాధ్యత కూడా పెరిగిందన్నది మరువరాదన్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, కార్యదర్శి చంద్రశేఖర్, మండల అధ్యక్ష, కార్యదర్శులు బాలాగౌడ్, వెంకన్న సర్పంచులు ఆంజనేయులు, సుధా, శ్రీకాంత్గౌడ్, రామకృష్ణారెడ్డి, శంకర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.