మక్తల్ టౌన్, మే 16 : రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, పండించిన ప్రతి గింజ నూ కొంటామని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. ఆదివారం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో మీ డియా సమావేశంలో ఎమ్మె ల్యే మాట్లాడుతూ శనివారం రాత్రి వర్షం పడడంతో అక్కడక్కడా కొంత ధాన్యం తడిసిందని, నియోజక వర్గంలో సొసైటీ, మార్కెట్యార్డు, మహిళా సంఘాల ద్వారా ధాన్యాన్ని కొంటుంన్నామని తెలిపారు. క్వింటాకు రూ. 1,888 చొప్పున కొంటున్నామని, కరోనా కష్ట కాలంలో రైతులు కొనుగోలు కేంద్రానికి రావడం వీలు కాకపోవడంతో వారి గ్రామాలకే వెళ్లి ధాన్యం కొంటున్నామని తెలిపారు. అక్కడక్క డా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిండుగా ఉండటంతో స్థలం లేక రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతి ఒక్కరికీ బస్తాలు అందుతాయని తెలిపారు. మక్తల్ మార్కెట్ యార్డు పరిధిలో రైతులకు లక్షా ఐదు వేల బ్యాగులు అందజేశామని ఇంతవరకు యాభైవేల బస్తాలు మార్కెట్ యార్డు పరిధిలో కొనుగోలు చేశామని తెలిపారు. సొసైటీ పరిధిలో లక్ష బ్యాగులు రైతులకు అందజేశామని, యాభై వేల బ్యాగులు కొన్నామని తెలిపారు. అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా ధా న్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో ఎవరూ బయటికి రావొద్దని, అత్యవసరమైతే మాస్కు ధరించి రావాలన్నారు.