రూ.15 లక్షలతో పరికరాలు సమకూర్చిన జగన్నాథ్రెడ్డి
అభినందించిన నారాయణపేట కలెక్టర్ హరిచందన
ఆత్మకూరు/మక్తల్ టౌన్, మే 14 : మక్తల్ పట్టణంలోని సర్కారు దవాఖానలో ఆక్సిజన్తో కూడిన కరోనా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీఆర్ఎస్ నాయకుడు వర్కటం జగన్నాథ్రెడ్డి పేర్కొన్నారు. వీజేఆర్ ప్రజాసేన ఆధ్వర్యంలో జగన్నాథ్రెడ్డి సొంత నిధులు రూ.15 లక్షలతో మక్తల్ దవాఖానకు సమకూర్చిన వైద్యపరికరాలను శుక్రవారం నారాయణపేట కలెక్టర్ హరిచందన, డీఐవో డా.శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ బారిన పడిన వారు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానిక వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, బెడ్స్, ఐదు పారా మానిటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు సమకూర్చినట్లు చెప్పారు. కొవిడ్ రోగుల కోసం వర్కటం అంజనీరెడ్డి, జగన్నాథ్రెడ్డి అందిస్తున్న సేవలు హర్షణీయమని కలెక్టర్ హరిచందన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వర్కటం దంపతులను ఆమె అభినందించారు.