మహబూబ్నగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు మహిళలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించా రు. కేవలం 10 రోజుల్లో 2.08 కోట్ల విత్తన బం తులు తయారు చేయడమే కాకుండా.. సీడ్ బా ల్స్తో అతి పెద్ద సెంటెన్స్ తయారు చేసి గిన్నిస్ బుక్లో పాలమూరు మహిళలు చోటు దక్కించుకున్నారు. పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, మెప్మా, మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, హెటిరో గ్రూపు పేరిట రికార్డు నమో దు అయినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ అధికారికంగా ప్రకటించారు. పాలమూరు జిల్లా మ హిళా సమాఖ్య, మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో సో మవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు TWO CRORE SEED BALLS MADE AND PLANTED BY SHG WOMEN TRANSFORM MAHABUBNAGAR IN TO HETERO GREEN BELT పేరిట సీడ్ బాల్స్తో అతిపెద్ద సెంటెన్స్ (వాక్యం) త యారు చేశారు. జిల్లా కేంద్రంలోని రైల్వే కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమమంతా యూ ట్యూబ్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు. లండన్ నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు సైతం కార్యక్రమం మొత్తం వీక్షించారు. ఉదయం 10:40 నిమిషాల నుంచి 12:35 మధ్యలో 73,918 బంతులతో అతి పెద్ద సెంటెన్స్ రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినట్లు ప్రకటించారు.
గిన్నిస్ రికార్డు ఎంపీ సంతోష్కు అంకితం: మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రీన్ ఇండియా చాలెంజ్తో రాష్ట్రంలోనే కాకుం డా దేశమంతా పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్కుమార్కు ఈ రికార్డును అంకితం ఇస్తున్నట్లు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఎంపీ సంతోష్కుమార్ దేశవ్యాప్తంగా మొ క్కలు నాటి చెట్లను పెంచాలన్న ధ్యేయాన్ని, స్ఫూ ర్తిగా తీసుకొని జిల్లాలో అధికారులు ఎలాగైనా ఈ సంవత్సరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సా ధించాలన్న పట్టుదలతో పనిచేశారని మంత్రి తెలిపారు. గతేడాది సాధించిన కోటీ 18 లక్షల విత్తన బంతుల రికార్డును తిరగరాసి రెండు కోట్ల 2 ల క్షల విత్తన బంతులు పది రోజుల్లో తయారు చేసినట్లు ఆయన వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పాలమూరుకు పేరు తీసుకువచ్చిన మహిళా గ్రూ పులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ స్ఫూర్తితో మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ఒక వి ప్లవం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ చాలెంజ్ ద్వారా దేశంలోని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు మొక్కలు నాటుతున్నారని గుర్తు చేశారు.
పాలమూరు మహిళలకు శుభాకాంక్షలు: ఎంపీ సంతోష్కుమార్
గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సాధించినందుకు మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు, పాలమూరు మహిళా సంఘాల సభ్యులకు ఎంపీ సంతోష్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు మహిళలంతా ఐక్యం గా 2 కోట్ల విత్తన బంతులు తయారు చేయడం ఎంతో గొప్ప విషయమని ఆయనన్నారు. విత్తన బంతుల ద్వారా అతి పెద్ద వాక్యం తయారు చేసిన మహిళలను ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మొక్కలు నాటడం, విత్తన బంతుల ద్వారా పచ్చదనం భారీగా పెంచాలని ఎంపీ సూచించారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీ సీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, వైస్ చైర్మన్ గణేశ్, డీఆర్డీవో యాదయ్య, మెప్మా పీడీ శంకరాచారి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శారద, నాగమల్లిక తదితరులు పాల్గొన్నారు.