ఎస్పీ చేతన
నారాయణపేట, మే 12 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు, కొవిడ్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్పీ చేతన తెలిపారు. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదని, తమ అవసరాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చేసుకోవాలన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ లేదా మరేదైనా అత్యవసర సమయాల్లో ఇతర రాష్ర్టాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ పాస్ విధానంతో అనుమతి ఇచ్చామన్నారు. ఈ పాస్ కోసం https://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో జిలాల్పూర్, ఎక్లాస్పూర్, కాన్కుర్తి, వాసవినగర్, చేగుంట తదితర ప్రాంతాల వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, చెక్పోస్టుల వ ద్ద 24 గంటలపాటు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.