వారంరోజుల్లో పూర్తిస్థాయిలో సేకరిస్తాం
12,095మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
జిల్లా సహకార సంఘం అధికారి సుధాకర్
జడ్చర్ల, జూన్ 11 : జిల్లాలో 17 పీఏసీసీఎస్లు, రెండు డీసీఎంఎస్ల ద్వారా 90వేల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని కొ నుగోలు చేసినట్లు జిల్లా సహకార సంఘం అధికారి (డీసీవో) సుధాకర్ తెలిపారు. మం డలంలోని గంగాపూర్, పోలేపల్లి గ్రామాల్లో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా డీసీవో మా ట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం 70 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 15,982మంది రైతుల నుంచి 90వేల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. రైతుల నుంచి కొనుగోలు చేసి న ధాన్యానికి వారంరోజుల్లో డబ్బులను వా రి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 12,095మంది రైతు ల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు. మండలంలోని బాదేపల్లి పీఏసీసీఎస్ ద్వారా ఇప్పటివరకు లక్షా 61వేల బస్తా ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. పోలేపల్లి కొనుగోలు కేంద్రంలో ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు.
మిగిలిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును వారంరోజు ల్లో పూర్తి చేస్తామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూ ర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు బాదేపల్లి పీఏసీసీఎస్ కార్యాలయాన్ని తని ఖీ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలకు నీళ్లు పోశారు. కార్యక్రమం లో మానిటరింగ్ అధికారి రాఘవేందర్ పాల్గొన్నారు.