కరోనా నివారణ నిబంధనలను పాటించాలి
మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ జూన్ 11 : ప్రతి ఒక్కరి ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవాల్సిన భాద్యత వారి వ్యక్తిగత జీవితంపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.11 లక్షల 16వేల 500ల వి లువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్యం భాగలేదని దిగులు చెందాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రతి క్షణం ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. కరోనా సమయంలోను కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు పూర్తి భరోసాను ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ దవాఖానలోను మె రుగైన వైద్య సేవలను అందించడం జ రుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్ కిశో ర్ తదితరులు ఉన్నారు.
మంత్రికి సన్మానం
మహబూబ్నగర్టౌన్, జూన్ 11 : రాష్ట్రవ్యాప్తంగా ఉ ద్యోగులు, పెన్షనర్లు, ఒప్పంద, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడంతోపాటు జీవోలు జారీ కావడంపై సం తోషం వ్యక్తంచేస్తూ శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఇంటర్ విద్య జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్య జేఏసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్స్ సంఘం నాయకులు భగవంతాచారి, మ ద్దిలేటి, అధ్యాపకులు మల్లికార్జున్, రఘువీర్సింగ్, శ్రీనివా స్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.