మహబూబ్నగర్ టౌన్, జూలై 10 : మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృ ష్టి సారించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం టీడీగుట్టలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానకాలంలో పారిశుధ్యం లోపించకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పట్టణప్రగతిలో గుర్తించిన ప్రతి సమస్యనూ పరిష్కరించాలని సూచించారు. మొక్కల పెంపకం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. టీడీగుట్ట సమీపంలోని ఖాళీ స్థలంలో ప్రకృతివనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా ప్రకృతివనాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. పారిశుధ్య పనులకు అవసరమైతే కూలీల సంఖ్య పెంచాలని సూ చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.
సకాలంలో పనులు పూర్తి చేయాలి
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శనివారం మండలకేంద్రంతోపా టు చిన్నాయిపల్లి, షేక్పల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. మండలకేంద్రంలో రోడ్డుపక్కన డబ్బాలను సాయంత్రంలోగా తొలగించాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. చిన్నాయిపల్లిలో పంచాయతీ కార్యదర్శి సకాలంలో హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అన్ని గ్రామాల్లో వందశాతం పనులు చేపట్టాలని సూచించారు. కాగా, కలెక్టర్ ఆదేశం మేరకు మండలకేంద్రంలో జేసీబీతో డబ్బాలు తొలగించేందుకు పంచాయతీ కా ర్యదర్శి యత్నించగా, వ్యాపారులు అడ్డుకున్నారు. తాము కలెక్టర్తో మాట్లాడే వరకు డబ్బాల తొలగింపును ఆపాలని కోరారు.
కంకణబద్ధులు కావాలి
పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజలు కం కణబద్ధులు కావాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10 రోజులుగా పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసిన జిల్లా అధికారు లు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదా లు తెలియజేశారు. ఈ ఏడాది 10రోజుల్లోనే 2 కోట్ల 8లక్షల విత్తనబంతులు తయారు చేసిన మహిళా సంఘాల సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.