ఊట్కూర్, జూలై 8 : పల్లెల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. నాలుగో విడుత పల్లె ప్రగ తిలో భాగంగా గురువారం మండలంలోని ఓబ్లాపూర్, పగిడిమర్రి, నిడుగుర్తి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకే నేరుగా నిధు లు మంజూరు చేస్తుందని తెలిపారు. గ్రామాలను పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచేందుకు పల్లె ప్రగతి కార్యక్రమా న్ని రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజూ చెత్త వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రజల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
ఎస్సీ కాలనీలో పర్యటించి సమస్యల ను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పారిశుధ్య కార్మికు ల సమస్యలను తెలుసుకున్న ఆయన ప్రభుత్వం ఇస్తున్న రూ. 8,500 జీతం లో కోత విధించి చెల్లిస్తుండడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. డ్రైనేజీలు మురు గు నీరు, రోడ్ల పక్కన పెంట కుప్పలను పరిశీలించి పంచాయతీ కార్యదర్శి వే ణుగోపాల్ను నిలదీశారు. గ్రామంలో పనులు సక్రమంగా నిర్వహించని అధికారులు, పాలకవర్గ సభ్యులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో సిద్ధిరామప్పను ఆదేశించారు. దత్తత గ్రామమైన ఓబ్లాపూర్ నుంచి జిల్లా కేంద్రం, మం డల కేంద్రానికి వేళ్లేందుకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, సీసీ కాల్వ ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తి చేయించి ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు పీఆర్ ఏఈ జగత్చంద్రకు బాధ్యతలను అప్పగించామన్నారు. మిషన్ భగీరథతో పగిడిమర్రిలో ప్రతి ఇంటికీ నల్లా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఎంపీడీవో కాళ ప్ప, సర్పంచ్ సులోచనమ్మ, ఎంపీటీసీ లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ల క్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. హరితహారంలో భాగంగా ఆయా గ్రా మాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల తో కలిసి మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా చేపడుతున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా తీసుకొని విజయవం తం చేయాలన్నారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుత కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే చిట్టెం అ న్నారు. మండలంలోని పగిడిమర్రిలో రూ.16 లక్షల నిధులతో పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో కరోనా కట్టడి సాధ్యమైందన్నారు. కరోనా మహమ్మారిని వ్యాక్సిన్తో అడ్డుకుందామని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని కోరారు. ప్రజలకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు.
‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం
కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. తాసిల్దార్ తిరుపతయ్య అధ్యక్షతన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజే శారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆడపి ల్లల వివాహాలకు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో సీ ఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమం లో డీటీ రాజగణేశ్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.