మహబూబ్నగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులకు మంగళవారం ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో దరఖాస్తు చేసుకొని కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న వేళ.. పూర్తిగా కంట్రోల్ చేసేందుకు లాక్డౌన్ను మరో 10 రోజుల పాటు పొడిగించారు. సడలింపు వేళలు పెంచడంతో ఎంతో వెసులుబాటు లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో అన్నదాతకు మరింత ప్రయోజనం చేకూరనున్నది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా మారనున్నది.
ఉమ్మడి జిల్లాలో 14 వేలకు పైగా దరఖాస్తులు..
మూడేండ్లుగా రేషన్ కార్డుల కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 14వేలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. మహబూబ్నగర్లో 4,500, నాగర్కర్నూల్లో 4,100, వనపర్తిలో 2,500, జోగుళాంబ గద్వాలలో 2,100, నారాయణపేటలో 1,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా తమకు రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో కొత్త కార్డుల జారీకి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో అర్హులందరికీ రేషన్కార్డులు దక్కనున్నాయి.
మరో 10 రోజులు లాక్డౌన్..
రాష్ట్రంలో లాక్డౌన్ను మరో పది రోజులు పొడిగించారు. సడలింపు వేళల పెంపుపై పాలమూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం పడిన తరుణంలో సడలింపుతో ప్రయోజనం కలుగనున్నది. ఈ నెల 10వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపు ఉంటుండగా… సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఇంటికి చేరుకునేందుకు గంట సమయాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్..
తొమ్మిది జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రా సెసింగ్ జోన్ల (టీఎస్ ఎఫ్పీజెడ్) ఏర్పాటుకు కేబినెట్ అనుమతిచ్చింది. ఒక్కొక్కటి 250 ఎకరాల కు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసిం గ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ తరుణంలో ఉమ్మడి జిల్లాలో సాగవుతున్న ధాన్యం ఆ డించేందుకు కొత్తగా రైసు మిల్లులు పెద్ద ఎత్తున ఏ ర్పాటు చేసేందుకు వీలవుతుంది. మరోవైపు మా మిడి పంటకు ప్రఖ్యాతి గాంచిన ఈ ప్రాంతం నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్తో రైతులు లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఏర్పడనున్నది.
రేషన్ కార్డుకు ఎదురుచూస్తున్నా..
రేషన్ కార్డు కోసం రెండేండ్ల కిందట దరఖాస్తు చేసుకున్నాను. ఎ ప్పుడెప్పుడు రేషన్ కార్డు లు ఇస్తారా అని వేచిచూస్తున్న వేళ సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో సంతోషాన్నిస్తోంది. ప్ర స్తుతం కరోనా సమయంలో రేషన్ కార్డు ఉం డటం వల్ల ఉచిత బియ్యం లభించనున్నది. నా లాంటి ఎందరో చిరుద్యోగులకు కొత్త రేషన్ కా ర్డులు వరంగా మారనున్నాయి. తెలంగాణ ప్ర భుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.