మహబూబ్నగర్ టౌన్, జూన్ 8 : కరోనా.. ప్రపంచాన్ని కలవరం పెడుతున్నది. ఈ మహమ్మారితో రెండేండ్లుగా ఎంతో మంది తనువు చాలించారు. మానవత్వం మంటగలుస్తున్నది. సొంత వారు కూడా తమ వారు కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బంధువులు కూడా దగ్గరకు వెళ్లడం లేదు. అంత్యక్రియలకు వెళ్తే తమకు కరోనా వస్తుందన్న భయంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ‘యూత్ వెల్ఫేర్’ మేమున్నామంటూ ముందుకొచ్చి సేవలందిస్తున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని యూత్ వెల్ఫేర్ అధ్యక్షుడు ఖాలేద్నవీద్ మిత్రబృందం ఆధ్వర్యంలో కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నది. కులమతాలకతీతంగా అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కరోనాతో మరణించిన 135 మందికి అంత్యక్రియలు నిర్వహించారు.
సంప్రదాయాలు పాటిస్తూనే..
ఏ మతం వారు మరణించినా.. యూత్ వెల్ఫేర్ సభ్యులు వారి ఆచారాలను గౌరవిస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముస్లిం యువకులు అయిన ఖాలేద్నవీద్, సైఫుద్దీన్, ముస్తాక్అహ్మద్, అలీమోద్దీన్, షఫీఉల్లా, అబూజర్, తయ్యబ్భవాజీర్, ఆదిల్, తయ్యాబ్బస్యార్ పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలకు హాజరైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అవగాహన కల్పిస్తున్నారు.
బాధితులను ఒంటరి చేయొద్దు..
కరోనా వచ్చిన వారికి ఒంటరిని చేయకుండా ధై ర్యం చెప్పాలి. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు చేసేందుకు కు టుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. స దరు వ్యక్తి బతికి ఉన్నప్పు డు కుటుంబసభ్యుల సం క్షేమం కోసం ఎంతో శ్రమించి ఉంటారు. అలాంటి వ్యక్తులు కరోనాతో మరణిస్తే కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉండడం చూస్తున్నాం. ఇది చూసి మా మనస్సు చలించింది. చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయాలని నిశ్చయించుకున్నాం. మిత్ర బృందంతో కలిసి ఇప్పటి వరకు కులమతాలకతీతంగా 135 మందికి అంత్యక్రియలు చేశాం. సేవలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉన్నది.
ఎంతో సంతృప్తినిస్తున్నది..
కరోనాతో మరణించి న వారికి అంత్యక్రియల ను నిర్వహించడంలో సంతృప్తి లభిస్తుంది. మా నవత్వంతో సేవ చేయ డం సంతోషాన్నిస్తున్నది. ఎవరైనా ఏదో ఒక రోజు మరణించక తప్పదు అని తెలిసినా.. కొందరూ బయపడి కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొనడం లేదు. కరోనా సోకుతుందన్న భయం వీడండి. అందరికీ ధైర్యం చెబుతూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం.
-ఆదిల్, యూత్ వెల్ఫేర్ సభ్యుడు, మహబూబ్నగర్