మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై7: భవిష్యత్లో రాష్ట్రం హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయ ఆవరణలో బుధవారం తెలంగాణ గెజిటెడ్ జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో డీటీవోలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. కార్యాలయంలో పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నదన్నారు. తెలంగాణ రాక ముందు కరువు కాటకాలు, వర్షాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, స్వరాష్ట్రంలో హరితహారం, ఇంకుడు గుంతలను తవ్వడం వంటి చర్యలతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ అవసరమని, ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10శాతం గ్రీన్ లెవల్ పెరిగిందన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గతంలో ఒక్క పార్క్ కూడా లేదని, ఇప్పుడు 25పార్కులతో పాటు, దేశంలోనే అతిపెద్దదైన 2097 ఎకరాలతో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా ట్రాన్స్పోర్టు కమిషనర్ దుర్గాప్రమీల, ఎంవీఐలు శ్రీనివాస్రెడ్డి, వీరాస్వామి గౌడ్, ఆర్టీవో పద్మశ్రీ, ఆర్టీఏ మెంబర్ జావెద్ బేగ్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి బక్క శ్రీనివాసులు, కోశాధికారి టైటాస్ పాల్, డీటీ నాగార్జున్, బాలచందర్, విజయ్కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం
వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం 46వ వార్డులో రూ.20లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రేమ్నగర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. పట్టణాభివృద్ధే ముం దున్న లక్ష్యమని, ఇప్పటికే జంక్షన్లను అభివృద్ధి చేసామని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్నందలాల్పవర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు బాలేశ్వరి, కిశోర్, నాయకులు అహ్మద్ పాల్గొన్నారు.