దేశంలోనే 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మనదే
తెలంగాణకు జీవనాధారం విద్యుత్
మిగులు కరెంట్లో అగ్రగామి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
కల్వకోలు, కుడికిళ్లలో విద్యుత్ ఉపకేంద్రాలు ప్రారంభం
పాల్గొన్న ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే బీరం, కలెక్టర్ శర్మన్
కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి, జూన్ 6 : వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇచ్చి పథకాలను అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలులో రూ.కోటీ 20లక్షలు, కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో రూ.కోటీ 50లక్షల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి, కలెక్టర్ శర్మన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్వకోలు, కుడికిళ్ల గ్రామా ల్లో విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుతో కరెంట్ సమస్యలు తీరుతాయన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్య లేకుండా చేశామన్నారు. తెలంగాణకు విద్యుత్ జీవనాధారని, రా ష్ట్రంలో ఉన్న భారీ సాగునీటి ప్రాజెక్టులు లిఫ్ట్లపైనే ఆధారపడినవేనని తెలిపారు. కరెంట్ లేకుంటే లిఫ్ట్లు నిలిచిపోతాయని, లిఫ్ట్లు లేకుంటే వ్యవసాయం నడవదన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్య ఉండకుండా విద్యుత్రంగాన్ని బలోపేతం చేసిందన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మిగు లు కరెంట్లో అగ్రగామిగా ఉందని మంత్రి వెల్లడించా రు. దేశంలో వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని తెలిపారు.
రాష్ర్టాలలో సుపరిపాలనకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అన్ని అంశాలను క్రోడీకరించి దేశంలోనే మన రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని ప్రకటించిందని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ, సేవారంగాలు కానీ వ్యవసాయరంగం అద్భుతంగా ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కరెంట్పై దృష్టి పెట్టి సరఫరా చేస్తున్నదన్నారు. రైతులు సంప్రదాయ పంటలను వదిలి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పం డించాలని సూచించారు. పత్తి, కంది, నూనెగింజల పంట ల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ, సింగిల్విండో చైర్మన్లు పెబ్బేటి కృష్ణయ్య, రాజగౌడ్, శ్రీనివాసులు, వైస్చైర్మన్ రాముయాదవ్, సర్పంచులు జ్యోతీరాము, ఉజ్వల, ఎంపీటీసీ వెంకటస్వామి, విద్యుత్ డీఈ శ్యాంసుందర్రెడ్డి, ఏడీ రవికుమార్, ఈఈ గోవర్దన్, ఏడీ(సివిల్) సుద్దీర్రెడ్డి, ఇన్చార్జి ఏఈ వెంకటయ్య, సబ్ ఇంజినీరు రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షడు రామచందర్యాదవ్, నాయకులు వెంకటేశ్వర్రా వు, లక్ష్మణ్రావు, మూలే కేశవులు, రాఘవేందర్, సాయిరాంయాదవ్, సాంబశివుడుయాదవ్, నాగరాజు, రవినాయక్, రాజశేఖర్, ప్రదీప్, శ్రీనివాస్సాగర్, వెంకటస్వామి, గిరిప్రసాద్, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సింగవట్నం రిజర్వాయర్
సామర్థ్యం పెంపునకు చర్యలు
కొల్లాపూర్, జూన్ 2 : మండలంలోని సింగవట్నం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామాలకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండగా శ్రీవారి సముద్రం రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డితో కలిసి సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సంపత్కుమార్శర్మ ,సతీశ్శర్మ వారికి పూర్ణకుంభంతో స్వాగ తం పలికి పట్టువస్ర్తాలతో సన్మానించారు. అనంతరం లక్ష్మీదేవమ్మకొండపై నుంచి శ్రీవారిసముద్రం రిజర్వాయర్లో నీటినిల్వ సామర్థ్యాన్ని మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, సిం గిల్విండో చైర్మన్లు పెబ్బేటి కృష్ణయ్య, చింతకుంట శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు రాఘవేందర్, మూలే కేశవులు, సతీశ్కుమార్ పాల్గొన్నారు.