కోస్గి, మే 6: కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని మతాల వారికి సమానంగా పండుగలకు దుస్తులు, సామగ్రి పంపిణీ చేస్తున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం కోస్గి తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దుస్తులను 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. నిరుపేదలైన ముస్లింలు పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ విధంగా పంపిణీ చేస్తున్నారన్నారు. అదేవిధంగా పేదింటి ఆడబిడ్డ ఎవరికీ భారం కావద్దని షాదీముబారక్ పేరుతో రూ.లక్షా నూట పదహారు అందిస్తున్నారన్నారు. ఈ విధంగా నిరంతరం ప్రజల పక్షాన ప్రజలకోసం ఆలోచించే ముఖ్యమంత్రికి ప్రతిఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శాసం రామకృష్ణ, జెడ్పీటీసి ప్రకాశ్రెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్ తాసిల్దార్ రాంకోటి, నాయకులు రాజేశ్తోపాటు తదితరులున్నారు.