మహబూబ్నగర్టౌన్, జూన్ 5: తెలంగాణ చౌరస్తా, ఆర్అండ్బీ అతిథి గృహం, మెట్టుగడ్డలో శనివారం రాత్రి కలెక్టర్ వెంకట్రావు లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. 16 గంటల పాటు సమర్థవంతంగా, క్రమ పద్ధతిలో లాక్డౌన్ను అమలు చేస్తున్న ఎస్పీ, ఇతర పోలీసు సిబ్బంది పనితీరును ఆయ న అభినందించారు. ఎవరైనా తప్పుడు గుర్తింపు కార్డులు చూపించినట్లయితే కఠినచర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు వీలైతే శుభ కార్యా లు వాయిదా చేసుకోవాలని, లేదా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతికొద్ది మందితో నిర్వహించుకోవాలని సూచించారు.