58 మందికి చెక్కులు అందజేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
హన్వాడ, జూన్ 2 : ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో 58మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు 1010మంది లబ్ధిదారులకు రూ.8కోట్ల 9లక్షల 8వేలు అందజేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులకు ఆడబిడ్డలు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.గ్రామాల్లో కరోనా నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల. తాసిల్దార్ శ్రీనివాసులు, ఏపీఎం సుదర్శన్, ఇన్చార్జి ఎంపీడీవో వెంకట్రెడ్డి, సర్పంచ్ రేవతి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, ఆర్ఐ కవిత, సింగిల్విండో వైస్చైర్మన్ కృష్ణయ్యగౌడ్ పాల్గొన్నారు.