మక్తల్ రూరల్, జూన్ 1: అధికారుల నిర్లక్ష్యం వల్ల గన్నీ బ్యాగుల కొరత ఏర్పడడంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గన్నీ బ్యాగుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. మక్తల్ మండలంలో వారం రోజులుగా ఖాళీ బ్యాగుల కొరత ఏర్పడింది. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేసింది. మండలంలో పీఏసీసీఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో మంథన్గోడ్, పస్పుల, మక్తల్ మార్కెట్ యా ర్డుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్దనుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే వారం రోజులుగా ఖాళీ బస్తాల కొరత ఏర్పడడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. రెండు రోజుల కిందట మక్తల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.
అయినప్పటికీ అధికారులు అరకొర బస్తాలను తెప్పించి ఇస్తున్నారని వారు వాపోయారు. కొందరు అధికారులు తమకు కావాల్సిన వారికి మాత్రమే బ్యాగులు ఇస్తున్నారని, మిగతా రైతులకు ఖాళీ బస్తాలు ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. ఇదిలావుండగా ఈ ఏడాది మక్తల్ మండలంలో యాసంగి సాగు వి స్తారంగా పెరిగింది. దీంతో గ్రామాలల్లో పంటలు సమృద్ధిగా పండడంతో ధాన్యం నిల్వలు కల్లాలోనే నిలిచి పోయాయి. ఒక వైపు ఖాళీ బస్తాల కొరత, మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే పలు గ్రామాల్లో ధాన్యం కల్లాలోనే తడచిపోయింది. దీంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ, సింగిల్ విండో సొసైటీలకు ఆ దేశాలు జారీ చేసింది. కాగా లాక్డౌన్ కారణంగా ట్రాన్స్పోర్ట్టు సమస్యల వల్ల సకాలంలో గన్నీ బ్యాగులు కొనుగోలు కేంద్రాలకు తరలించిడంలో కొంత జాప్యం జరుగతుంది. రైతుల ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి 20 లక్షల గన్నీ బ్యాగ్లను తెప్పించి నియోజకవర్గంలోని ఆయా కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేయించారు. అయినా ఇంకా బ్యాగుల కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గన్నీ బ్యాగులను పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని పలువురు రైతులు కోరారు.