మహబూబ్నగర్: ఆధునాతంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైద్రాబాద్లోని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, వైస్ ఛైర్మన్ తాటి గణేశ్ తదితరులతో కలిసి సమిక్షించి నమూనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు, వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకుగాను నూతనంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించుకుందామని తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర నూతన నమూనలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్, లక్ష్మణ్ నాయక్, చిన్న, శ్రీనివాసులు, ఎస్ఈ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.