నవాబ్పేట: రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామ రైతుబంధు అధ్యక్షుడు సంజీవరెడ్డి ఇంట్లో బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం కండ్లకు కట్టినట్లు కన్పిస్తున్నదన్నారు.
రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంట్, వరికి మద్దతు ధర కల్పించడం జరుగుతోందన్నారు. శాశ్వతంగా కరువును పారద్రోలాలనే ఉద్దేశ్యంతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతోందన్నారు. రైతు పండించిన ధాన్యానికి అతడే ధర నిర్ణయించే స్థాయికి ఎదిగే విధంగా కృషి చేస్తున్నారని తెలిపా రు. ఓ పక్క కేసీఆర్ అభివృద్ది, మరో పక్క కేటీఆర్ పరిశ్రమలను నెలకొల్పడం చూస్తుంటే అభివృద్ధి జోడెద్దులను తలపిస్తుందన్నారు.
పక్కనే ఉన్న రాష్టాల్లో బీజేపీ ప్రభుత్వాలు మన పథకాలు కాపీ కొట్టే పరిస్థితి నెలకొందని తెలిపారు. సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ మాడెమోని నర్సిములు, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, నాయకులు ప్రతాప్, మెండె లక్ష్మయ్య, శీనయ్య, చెన్నయ్య, పాశం కృష్ణయ్య, పాశం నరేందర్, మాధవులు, సుభాన్చారి, కృష్ణారెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.