జడ్చర్ల: పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్యా ణలక్ష్మి, షాదీముభారక్ పథకాలను అమలు చేయిస్తున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్స్లో 231మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలు ఎదుగుతుంటే వారి పెళ్లిళ్లు ఎలా చేయాల నే ఆలోచనతో ఉండే వారని, ముఖ్య మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నేడు పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ల ద్వారా ఒక్కో ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం రూ.1,00,116రూపాయలు ఇవ్వడం జరుగు తుందని దాంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లిళ్లు చేయడం జరుగుతుందన్నారు.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నిత్యం పేద ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా సంక్షోభంలోను అన్ని సంక్షేమపథకాలను అమలు చేశారన్నారు.