నారాయణపేట టౌన్, మార్చి 28 : జిల్లాకు మంజూరై న రైతు కల్లాలను వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన 2, 4వ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించగా, జెడ్పీ వైస్చైర్పర్సన్ సురేఖారెడ్డి అధ్యక్షతన 3వ, నర్వ జెడ్పీటీసీ జ్యో తి అధ్యక్షతన 5వ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో సంబంధిత శాఖ అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లా దవాఖానలో జనవరి నుంచి మార్చి వరకు 237 ఆపరేషన్లు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్లను ప్రోత్సహించరాదని, సాధారణ కాన్పులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తా జుద్దీన్ మాట్లాడుతూ మిషన్ భగీరథ నుం చి 3, 4 రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పే ర్కొన్నారు.
పెద్ద గ్రామ పంచాయతీలకు సంబంధించిన మోటర్ల మరమ్మతులకు అ నుమతి ఇవ్వాలని కోరారు. ధన్వాడ మండలంలో రేషన్ బియ్యంలో 50శాతంపైగా నూకలు వస్తున్నాయని, నూకలు రాకుం డా చర్యలు తీసుకోవాలన్నారు. 5వ స్థా యీ సంఘంలో జెడ్పీటీసీ జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గ ర్భిణులకు పౌష్టికాహారంతోపాటు ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. సమావేశాలలో జె డ్పీ సీఈవో సిద్ధిరామప్ప, డిప్యూటీ సీఈవో జ్యోతి, ఆ యా శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరిని కేంద్రం కొనాలని తీర్మానం
తెలంగాణాలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నా రు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొ నుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో వైస్చైర్పర్స న్ సురేఖారెడ్డి, జెడ్పీటీసీలు అంజలి, జ్యోతి, వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.