పాలమూరు, అక్టోబర్ 26 : చేతివృత్తులను నాశనం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యేలు వివేకానందరెడ్డి, ఆనంద్తో కలిసి మంత్రి ప్రచారం నిర్వహించారు. పద్మశాలీల ఇండ్లకు వెళ్లి చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి పోస్టుకార్డులు రాయించారు. మోదీ సర్కార్ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. గులాబీ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.
అనంతరం 6వ వార్డునకు చెంది న కాంగ్రెస్ ముఖ్య నేత సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో సూమారు 100 మంది టీఆర్ఎస్లో చేరారు. నారాయణపురంలోని రాఘవేంద్ర గార్డెన్స్లో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో కర్ణాటకకు చెందిన నారాయణగురు శక్తి పీఠాధిపతి, ఆర్య, ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామిజీతో మంత్రి గంగు కమలాకర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జెడ్పీటీసీ వీరమల్లి భానుమతి వెంకటేశంగౌడ్, ఎంపీపీ ఉమా ప్రేమచంద్రారెడ్డి, గౌడ సంఘం నాయకులు పాలకొల్లు యాదయ్యగౌడ్, గంగాపురం శ్రీరాములుగౌడ్, నరసింహాగౌడ్, నాగయ్యగౌడ్, సత్తయ్యగౌడ్, యాదగిరిగౌడ్, పద్మశాలీ రాష్ట్ర నేత కుంద్యాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజు పాల్గొన్నారు.