మహబూబ్నగర్, అక్టోబర్ 12 : గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి క లెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 34 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 12,115మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బూట్లు (షూ) ధరించకూడదని, సాధారణ చెప్పులు వేసుకొని రావాలని సూ చించారు.
ఉదయం 8:15నుంచి 10:15 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. 10:30 గంటలకు పరీక్ష ఉన్నప్పటికీ అభ్యర్థులు 15నిమిషాలు ముందుగానే కేంద్రానికి చేరుకొని బయోమెట్రిక్ను పూర్తి చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించి 9 రూట్లను ఏర్పాటు చేశామని, లైజన్, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు గుర్తింపుకార్డుగా ఆధార్, ఓటరుకార్డు, డ్రైవింగ్ లైసెన్స్తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డుల్లో ఒకటి తీసుకురావాలన్నారు. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫొటో సక్రమంగా లేకపోతే 3 పాస్పోర్టు సైజ్ ఫొటోలపై గజిటెడ్ అధికారిచే సంతకం చేయించుకుని పరీక్షాకేంద్రానికి హాజరుకావాలని సూచించారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ కేంద్రాలను బంద్ చేయనున్న ట్లు తెలిపారు. అభ్యర్థులకు బస్సులను అం దుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.
పటిష్ట బందోబస్తు : ఎస్పీ
గ్రూప్-1 పరీక్ష సందర్భంగా అన్ని కేం ద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చే యనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. అ భ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకూడదని సూచించారు. ఆన్లైన్లో హాల్టికెట్ తీసుకున్న తర్వాత నిబంధనలను తెలుసుకోవాలని తెలిపారు. పరీక్ష సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 2గంటల ముందుగానే ప రీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
వనపర్తిలో మాట్లాడుతున్న కలెక్టర్ యాస్మిన్ బాషా
అన్ని ఏర్పాట్లు చేయాలి
వీడియోకాన్ఫరెన్స్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి
మహబూబ్నగర్, అక్టోబర్ 12 : గ్రూ ప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లుతో మాట్లాడా రు. పరీక్షాకేంద్రాల్లో అవసరమైన ఫర్నిచ ర్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 80మంది పరీక్ష రాయనున్నట్లు తె లిపారు. ఉదయం 10:15 గంటల తర్వా త ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షాకేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. అభ్యర్థులను తనిఖీ చేసేందుకు పోలీస్శాఖ తగిన ఏర్పా ట్లు చేయాలని సూచించారు. ప్రశ్నాపత్రా లు, ఓఎంఆర్ షీట్ల భద్రతకు స్ట్రాంగ్రూం లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు ఉన్నారు.