జడ్చర్ల, జూన్ 26: వానకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని డీపీవో వెంకటేశ్వర్లు సూచించారు. సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సుకు డీపీవో హాజరై మాట్లాడారు. వానకాలం దృ ష్ట్యా గ్రామాల్లో పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశవర్కర్లు 10రోజుల పాటు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. దోమల వల్ల డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికెన్ఫాక్స్ తదితర వ్యాధులు వస్తాయన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగేలా, ఆహారపదార్థాలను వేడిచేసి తినేలా తెలపాలని సూచించారు. అదేవిధంగా శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, ప్రతి ఆదివారం ఎవరి ఇండ్లలోవారు ఇంటి ఆవరణను శుభ్రపర్చుకోవాలని చెప్పారు. సమావేశంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మలేరియా జిల్లా అధికారి డాక్టర్ విజయ్కుమార్, గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ సమత, ఎంపీవో జగదీశ్, పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
మిడ్జిల్, జూలై 26: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని డీఎల్పీవో వరలక్ష్మి అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం ఎంపీవో అనురాధతో కలసి పర్యటించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీలో ఆయిల్బాల్స్ను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూలై 26: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ గోపినాయక్ అన్నారు. మండలంలోని వాయిల్కుంటతండా, గుడిబండతండాలో మంగళవారం పంచాయతీ సిబ్బందితో పారిశుధ్యపనులు, బ్లీచింగ్ ఫౌడర్ చల్లించారు. రోడ్లపై మురుగు, ఇండ్ల చుట్టూ పిచ్చిమొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, జూలై 26: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా బూస్టర్ డోస్ను ప్రతిఒక్కరూ వేసుకునేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ఛత్రునాయక్, ఎంపీడీవో రూపేందర్రెడ్డి, ఎంపీవో శంకర్నాయక్, తాసిల్దార్ జ్యోతి, డాక్టర్ రాహుల్, పంచాయతీ కార్యదర్శులు. ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.