మహబూబ్నగర్టౌన్, మే 24: అందరి సహకారంతో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. పీయూ వీసీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం అధ్యాపకులు, సిబ్బంది సన్మానించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ పీయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావడం సంతోషంగా ఉందన్నారు. విద్య, పాలనాపరంగా పలు సంస్కరణలు చేపట్టామన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంతోపాటు కొత్త కోర్సులు, పీజీ సెంటర్ల ఏర్పాటు, జాతీయ, అంతర్జాతీయ వెబినార్లు నిర్వహించామని వెల్లడించారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక సెల్ ఏర్పాటు, టెట్ కోచింగ్ ఇస్తున్నామన్నారు. త్వరలో కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశామన్నారు. రూ.10కోట్లతో ఎగ్జామినేషన్ బ్రాంచ్, రూ.కోటీ72లక్షలతో వీసీ రెసిడెన్సీ, రూ.4కోట్ల 5లక్షలతో గెస్ట్హౌస్ నిర్మిస్తున్నామన్నారు.
హరితహారం కింద పెద్దఎత్తున మొక్కలు నాటామని, చెంచులకు మెగా హెల్త్క్యాంప్ నిర్వహించామన్నారు. పీయూ క్రీడాకారిణి మహేశ్వరి, కోచ్ రమేశ్కు క్యాష్ అవార్డు అందజేసి సత్కరించామని తెలిపారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో పీయూను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. న్యాక్-ఏ గ్రేడ్ లక్ష్యంగా అభివృద్ధి చేయనున్నట్లు వీసీ తెలిపారు. త్వరలోనే పీయూలో సీఎం కబడ్డీ చాంపియన్షిప్ నిర్వహించేందుకు కృషిచేస్తామన్నారు. అంతకుముందు కేక్ కట్ చేశారు. అదేవిధంగా వీసీకి సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి రావటంతో రిజిస్ట్రార్ పిండి పవన్కుమార్, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి రాజ్కుమార్, సోమలింగం, రవికుమార్, వెంకట్రాములు, దయానంద్, పీఆర్వో అర్జున్కుమార్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.