అచ్చంపేట, మే 4 : పద్మశ్రీ కిన్నెర మొగుల య్య ఇంట్లో విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తు రోడ్డుపై జారిపడి కుమార్తె బుద్దుల రాములమ్మ (38) మృతి చెందింది. వివరాల ఇలా.. మొగుల య్య రెండో కుమార్తె రాములమ్మను నాగర్కర్నూల్ మండలం లింగసానిపల్లికి చెందిన వెంకటస్వామికి ఇచ్చి 20 ఏండ్ల కిందట వివాహం చేశాడు. వివాహమైన నాలుగేండ్ల తర్వాత వెంకటస్వామి మృతి చెందగా.. హైదరాబాద్లో కూలి పనులు చేసుకుం టూ ఆమె కుమార్తె వెన్నెల మన్ననూర్లోని సాం ఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదివిస్తున్నది. కూతురి బాగోగులను తం డ్రి మొగులయ్యనే చూసుకునేవాడు. ఇటీవల లిం గాల మండలం అవుసలికుంట గ్రామానికి మొగులయ్యతో పాటు రాములమ్మ వచ్చింది. ఈ క్రమం లో మంగళవారం రాత్రి బయటకు వెళ్లిన ఆమె ఇం టికి తిరుగి వస్తుండగా.. రోడ్డుపై ప్రమాదవశాత్తు జారిపడడంతో తలకు బలమైన గాయమైంది. వెం టనే ఆమె లింగాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని, అచ్చంపేట ద వాఖానకు తరలించాలని వైద్యులు సూచించారు. దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఫోన్లో మొగులయ్యను పరామర్శించారు. రాములమ్మ కుమార్తె వెన్నెలకు అన్నీతానై సహకారం అందిస్తానని భరోసానిచ్చారు. మొగులయ్యకు 9 మంది సంతానం కాగా ఇప్పటికే నలుగురు మృతిచెందారు. ఐదేండ్ల కిందట మొగులయ్య భార్య అనారోగ్యంతో మృతి చెందింది. కాగా మరో కుమారుడు మహేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.