మక్తల్ అర్బన్, అక్టోబర్ 10 : ఉ పాధ్యాయ ఎమ్యెల్సీ కోసం ఉపాధ్యాయులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తపస్ మండల అధ్యక్షుడు రవీందర్ అన్నారు. పట్టణంలోని ప లు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఫామ్ 19ను సోమవారం అం దించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఓటు హక్కు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతున్నదన్నారు. పార్ట్ టైమ్, గెస్ట్ టీచర్కు అర్హత లేదని, పాత ఓటర్ల జాబితా ఉండదని, అర్హులైన ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మం డల ప్రధానకార్యదర్శి రాకేశ్, సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు దరఖా స్తు చేసుకోవాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యా య సంఘం (తపస్) నాయకులు సూచించారు. మండలంలోని పలు పాఠశాలలలు, కేజీబీవీలో ఉపాధ్యాయులకు సోమవారం ఫామ్ 19 దరఖా స్తు ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా తప స్ మండలాధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, రాంచంద్రయ్య, కృష్ణ మాట్లాడారు. ఉపాధ్యాయు లు విధిగా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు సురేశ్, జగన్నాథ్రావు, శేఖర య్య, ధనుంజయ, లక్ష్మి, సీతారాములు, బస్వరా జ్, అంబర్నాథ్ పాల్గొన్నారు.